స్టూడెంట్స్తో కాళ్లు పట్టించుకున్న టీచర్
NEWS Nov 04,2025 01:23 pm
శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి (మం) బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఓ టీచర్ వీధి రౌడీలా కుర్చీలో కూర్చుని పిల్లలతో కాళ్లు పట్టించుకుంది. కుర్చీ వెనక్కి వాలి ఫోన్లో మాట్లాడుతూ ఇద్దరు విద్యార్థినులతో చెరొక కాళ్లు నొక్కించుకుంటున్న వీడియో బయటకు వచ్చింది. వీడియో నెట్టింట వైరల్గా మారడంతో అధికారులు రంగంలోకి దిగారు. ఈఘటనపై ఐటీడీఏ సీతంపేట పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్ ఉపాధ్యాయురాలికి ఇప్పటికే షోకాజ్ నోటీసు జారీ చేశామని, విచారణకు ఆదేశించామన్నారు. తన కాలు బెనికడంతో విద్యార్థులు సహాయం చేస్తున్నారని ఆ టీచర్ చెబుతోంది.