హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో సదర్ ఉత్సవాన్ని సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించారు. అభివృద్ధి, సంక్షేమం, రాజకీయ ప్రాతినిథ్యంలో యాదవులకు సముచిత స్థానం కల్పిస్తామని ఈ సందర్భంగా సీఎం హామీ ఇచ్చారు పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం.. సదర్ ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించలేదన్నారు. కాంగ్రెస్ వచ్చాక సదర్ ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ యాదవులకు రాజకీయ అవకాశాలు కల్పించిందని సీఎం తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన ప్రభుత్వంలో యాదవులది అత్యంత కీలకమైన పాత్ర అన్నారు.