ప్రపంచ ప్రఖ్యాత నోబెల్ శాంతి బహుమతి-2025 వెనెజువెలాకు చెందిన మరియా కొరీనా మచాడోను వరించింది. ఈ విషయాన్ని నార్వే అకాడమీ ప్రకటించింది. ప్రజల హక్కుల కోసం పోరాడినందుకుగానూ ఆమెను ఈ అత్యున్నత పురస్కారానికి ఎంపిక చేసినట్లు వెల్లడించింది. ఐతే, ఈ అత్యున్నత పురస్కారం కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు.