హుకుంపేటలో సూపర్ జీఎస్టీ గ్రామసభ
NEWS Oct 04,2025 10:56 pm
హుకుంపేట: సూపర్ జీఎస్టీతో ప్రజలకు విస్తృతంగా మేలు జరుగుతుందని బీజేపీ అరకు పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు, మఠం పంచాయతీ సర్పంచ్ మఠం శాంత కుమారి అన్నారు. పంచాయతీ కార్యదర్శి శివకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన “సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్” గ్రామసభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు వాడే సుమారు 400 వస్తువులపై జీఎస్టీ భారీగా తగ్గిందని, వార్షిక ఆదాయం ₹12 లక్షల వరకు ఉన్న ఉద్యోగులు, వ్యాపారులు, మధ్య తరగతి, పేద వర్గాలపై జీఎస్టీ మినహాయింపు లభించిందని శాంత కుమారి చెప్పారు. ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ పథకం సామాన్యులపై భారం తగ్గించడంతో పాటు ఉపశమనం కలిగిస్తోందని అభిప్రాయపడ్డారు.