గోదావరికి పోటెత్తిన వరద ఉధృతి
NEWS Sep 28,2025 12:47 pm
గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. అంతకంతకూ వరద ఉధృతి పెరుగుతోంది. భద్రాచలం వద్ద ప్రస్తుతం నీటి మట్టం 42.4 అడుగులకు చేరుకుంది. ధవళేశ్వరం వద్ద ఇన్ , ఔట్ ఫ్లో 10.88 లక్షల క్యూసెక్కులుగా ఉంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్. పొంగిపొర్లే వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని సూచించారు.