తిరుమల భక్తులతో కిటకిట
NEWS Sep 27,2025 08:07 am
భక్త బాంధవులతో తిరుమల పుణ్యక్షేత్రం కిట కిట లాడుతోంది. శ్రీవారిని 75 వేల 358 భక్తులు దర్శించుకున్నారు. 29 వేల 166 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.58 కోట్ల ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్. స్వామి వారి దర్శనం కోసం 29 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారని, ఎలాంటి టోకెన్ల లేకుండా ఉన్న వారికి 24 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.