శ్రీవారి హుండీ ఆదాయం రూ. 1.74 కోట్లు
NEWS Sep 26,2025 07:13 am
తిరుమల శ్రీవారిని 67 వేల 388 మంది భక్తులు దర్శించుకున్నారు. 21 వేల 998 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 1.74 కోట్లు వచ్చిందని తెలిపారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్. ప్రస్తుతం భక్తులు 16 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారని, ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు కనీసం 16 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.