శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.03 కోట్లు
NEWS Sep 02,2025 07:12 am
తిరుమల క్షేత్ం భక్తులతో కిట కిట లాడుతోంది. శ్రీవారిని 65 వేల 384 మంది భక్తులు దర్శించుకున్నారు. 22 వేల 512 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.03 కోట్లు వచ్చినట్లు తెలిపారు ఈవో శ్యామల రావు. ప్రస్తుతం దర్శనం కోసం భక్తులు 6 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారని, ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు కనీసం 6 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.