శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.49 కోట్లు
NEWS Sep 01,2025 09:09 am
తిరుమల పుణ్యక్షేత్రం భక్తులతో కిట కిట లాడుతోంది. ఈ నెలలోనే సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. శ్రీ వేంకటేశ్వర స్వామిని 70 వేల 310 మంది భక్తులు దర్శించుకున్నారు. 21 వేల 866 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.49 కోట్లు వచ్చినట్లు ఈవో వెల్లడించారు. ప్రస్తుతం భక్తులు 3 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారని, ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు 4 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.