తిరుమల క్షేత్రం భక్త జనసందోహం
NEWS Aug 31,2025 09:07 am
తిరుమల పుణ్య క్షేత్రం భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామిని 77 వేల 295 మంది భక్తులు దర్శించుకున్నారు. 26 వేల 779 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.92 కోట్లు వచ్చినట్లు వెల్లడించారు ఈవో. స్వామి దర్శనం కోసం ప్రస్తుతం 12 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారని, ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు కనీసం 10 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.