శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.49 కోట్లు
NEWS Aug 29,2025 09:47 am
తిరుమల పుణ్యక్షేత్రం భక్తులతో కిట కిట లాడుతోంది. శ్రీవారిని 63 వేల 843 మంది భక్తులు దర్శించుకున్నారు. 21 వేల 344 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.49 కోట్లు వచ్చినట్లు తెలిపారు ఈవో. ప్రస్తుతం స్వామి వారి దర్శనం కోసం 15 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారని, ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు కనీసం 10 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.