వర్షాలు: మెట్పల్లి ప్రజలకు మున్సిపల్
కమిషనర్ మోహన్ సూచనలు
NEWS Aug 28,2025 01:23 pm
మెట్పల్లి పట్టణంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పట్టణ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ మోహన్ సూచించారు. ఐరన్ కరెంటు స్తంభాల దగ్గరికి వెళ్లరాదని, శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసించరాదని ఆయన హెచ్చరించారు. గణేష్ మండపాలలో తడిచేతులతో కరెంటు బోర్డులను తాకరాదని, కరెంటుకు సంబంధించిన వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పట్టణ ప్రజలందరూ సురక్షితంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ విజ్ఞప్తి చేశారు.