ప్రజలకు సీఐ సురేష్ బాబు సూచనలు
NEWS Aug 28,2025 01:18 pm
కోరుట్ల: భారీ వర్షాల దృష్ట్యా కోరుట్ల, కథలాపూర్, మేడిపల్లి మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఐ సురేష్ బాబు సూచించారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, పాడుబడిన లేదా కూలిపోయే పరిస్థితిలో ఉన్న ఇళ్లలో నివసించే వారు తప్పనిసరిగా సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దూరప్రయాణాలను వాయిదా వేసుకోవాలని, వరద ప్రవాహాలను దాటే ప్రయత్నం చేయరాదని హెచ్చరించారు. అలాగే కరెంటు ట్రాన్స్ఫార్మర్లకు దూరంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డయల్ 100కు కాల్ చేయాలని సూచించారు.