ప్రజలకు సూచనలు అందించిన ఎస్సై రాజు
NEWS Aug 28,2025 01:13 pm
మల్లాపూర్: భారీ వర్షాల నేపథ్యంలో మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై రాజు సూచించారు. అత్యవసరమైతే తప్ప ఇండ్ల నుంచి బయటకు రావొద్దని, పాడుబడిన ఇండ్లలో నివసించేవారు సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని కోరారు. దూరప్రయాణాలు వాయిదా వేసుకోవాలని, వరద ప్రవాహాలను దాటే ప్రయత్నం చేయవద్దన్నారు. కరెంటు ట్రాన్స్ఫార్మర్లకు దూరంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డయల్ 100కు కాల్ చేయాలని సూచించారు.