తిరుమల భక్తులతో కిటకిట
NEWS Aug 28,2025 11:03 am
పుణ్యక్షేత్రం తిరుమల భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది. శ్రీవారిని 77 వేల 185 మంది భక్తులు దర్శించుకున్నారు. 23 వేల 98 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.06 కోట్లు వచ్చినట్లు తెలిపారు ఈవో. ప్రస్తుతం 6 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారని, ఎలాంటి టోకెన్లు లేని వారికి కనీసం 12 గంటలకు పైగా పడుతుందన్నారు.