శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.07 కోట్లు
NEWS Aug 26,2025 07:14 am
తిరుమల భక్తులతో కిట కిట లాడుతోంది. శ్రీవారిని 67 వేల 767 మంది భక్తులు దర్శించుకున్నారు. 25 వేల 852 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.07 కోట్లు వచ్చినట్లు తెలిపారు ఈవో జె. శ్యామల రావు. 10 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారని, ఎలాంటి టోకెన్లు లేని వారికి కనీసం 11 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.