కమిషన్ బకాయిలతో రేషన్ డీలర్ల ఆవేదన
NEWS Aug 25,2025 02:43 pm
మెట్ పల్లి: ఐదు నెలల నుండి కమిషన్ రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రేషన్ డీలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు ఆర్డీఓ, ఎంఆర్ఓలకు మెమొరాండం సమర్పించారు. తక్షణమే పెండింగ్లో ఉన్న కమిషన్ విడుదల చేసి సమస్యను పరిష్కరించాలని డీలర్లు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మెట్ పల్లి పట్టణ, మండలానికి చెందిన రేషన్ డీలర్లు పాల్గొన్నారు.