వార్ ఆపేందుకే ఇండియాపై టారిఫ్ లు
NEWS Aug 25,2025 07:40 am
అమెరికా దేశ ఉపాధ్యక్షుడు వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా ఏకపక్షంగా ఉక్రెయిన్ పై దాడులకు దిగుతోందని, దానిని ఆపాలంటే , ఆ దేశంతో చమురు కొనుగోలు చేస్తున్న ఇండియాపై తాము 50 శాతం సుంకాలు విధించాల్సి వచ్చిందన్నారు. మరో వైపు అలెక్సా వేదికగా ట్రంప్ తో రష్యా చీఫ్ పుతిన్ జరిపిన చర్చలు ఫలప్రదం కాలేదు. ఆ వెంటనే రష్యా ఉక్రెయిన్ పై ఏకపక్షంగా దాడికి దిగింది.