తిరుమల క్షేత్రం భక్త సందోహం
NEWS Aug 25,2025 06:40 am
తిరుమల భక్తులతో కిట కిట లాడుతోంది. శ్రీవారిని 72 వేల 119 మంది భక్తులు దర్శించుకున్నారు. 25 వేల 294 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.02 కోట్లు వచ్చినట్లు తెలిపారు ఈవో శ్యామల రావు. ప్రస్తుతం 4 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారని , ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు 8 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.