ఉత్తమ ఎంప్లాయ్ రమేష్కు సన్మానం
NEWS Aug 23,2025 09:46 pm
మెట్పల్లి: కేడీసీసీ బ్యాంక్ మెట్పల్లి బ్రాంచ్ పరిధిలోని ముత్యంపేట సొసైటీ సీఈఓ బొజ్జ రమేష్, ఉత్తమ ఎంప్లాయ్ అవార్డు అందుకున్న సందర్భంగా సన్మాన కార్యక్రమం జరిగింది. మాజీ సింగిల్ విండో చైర్మన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లూరి మహేందర్ రెడ్డి ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రమేష్ కృషి, నిబద్ధతను ప్రశంసించారు. కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ రేవంత్ కుమార్, బ్యాంకు సిబ్బంది, మాజీ సర్పంచ్ తిరుపతిరెడ్డి, సంఘ కార్యదర్శులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.