టీటీడీకి రూ.50 లక్షలు విరాళం
NEWS Aug 23,2025 10:26 am
ఇండియన్ ఎక్స్ ప్రెస్ గ్రూప్ కు చెందిన ఎక్స్ ప్రెస్ ఇన్ ఫ్రా ఎండీ కవిత సింఘానియా శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రాణదాన ట్రస్టుకు రూ.50 లక్షలు విరాళం అందించారు. ఈ మేరకు దాత ప్రతినిధులు జాన్ మని, బొమ్మల మురళీలు తిరుమలలోని అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు.