సురవరం పట్ల జగన్ సంతాపం
NEWS Aug 23,2025 08:06 am
సీపీఐ అగ్రనేత సురవరం సుధాకర్రెడ్డి మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి తీరని లోటు అని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన సురవరం వామపక్ష నేతగా గుర్తింపు పొందారని, ఏ పదవిలో ఉన్నా ఆ పదవికి వన్నె తెచ్చారని కొనియాడారు. చివరి శ్వాస వరకు ప్రజల బాగు కోసం తపించిన గొప్ప నాయకుడు అని ప్రశంసించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు.