తిరుమల భక్తులతో కిటకిట
NEWS Aug 23,2025 07:53 am
తిరుమల పుణ్యక్షేత్రం భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని 72 వేల 67 మంది భక్తులు దర్శించుకున్నారు. 25 వేల 212 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.75 కోట్లు వచ్చినట్లు వెల్లడించారు ఈవో జె. శ్యామల రావు. భక్తులు ప్రస్తుతం 14 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారని, సర్వ దర్శనం కోసం 8 గంటలకు పైగా సమయం పడుతుందని పేర్కొన్నారు.