తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
NEWS Aug 22,2025 09:38 am
గోదావరికి వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భద్రాచలం వద్ద తగ్గుముఖం పట్టింది. నీటిమట్టం 49.3 అడుగులకు చేరుకుంది. ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 13.11 లక్షల క్యూసెక్కులుగా ఉంది. వరద ప్రవాహం రాత్రి నుంచి క్రమంగా తగ్గే అవకాశం ఉందని, స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నామన్నారు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్. సహాయక చర్యల్లో 8 SDRF, 4 NDRF బృందాలు పాల్గొన్నాయని తెలిపారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.