22న ‘పనుల జాతర’ ప్రారంభం: కలెక్టర్
NEWS Aug 21,2025 01:32 pm
ఖమ్మం: ఈనెల 22న జిల్లాలో ‘పనుల జాతర’ ప్రారంభిస్తారని కలెక్టర్ అనుదీప్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ద్వారా పూర్తయిన పనులను ప్రారంభించగా, కొత్త పధకాల పనులను కూడా ప్రారంభిస్తారు. గ్రామపంచాయతీ, అంగన్వాడీ భవనాలు, సెగ్రిగేషన్ షెడ్లు, పశువుల కొట్టాలు, అజోలా పిట్ నిర్మాణాలు వంటి పనుల శంకుస్థాపనలు కూడా ఈ సందర్భంగా జరుగుతాయి.