భద్రాద్రిలో గోదావరి ఉధృతి : రెండో హెచ్చరిక జారీ
NEWS Aug 21,2025 09:44 am
భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం పెరుగుతున్న నేపథ్యంలో భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పునరావాస చర్యలు చేపట్టామన్నారు. అవసరమైతే మరిన్ని సహాయక కేంద్రాలు ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రజలకు వైద్య సేవలు, తాగునీరు, ఆహారం సరఫరా వంటి అన్ని సౌకర్యాలను అందించాలని ఆదేశించారు.