టీడీపీ ఎమ్మెల్యేపై విచారణకు ఆదేశం
NEWS Aug 21,2025 07:16 am
శ్రీశైలం ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి తన అనుచరులతో కలిసి అటవీ శాఖ సిబ్బందిపై దాడి చేయడం దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వెంటనే విచారణ చేపట్టాలని ఆదేశించారు. తక్షణమే నివేదిక అందించాలని, ఏ పార్టీకి చెందిన వారైనా సరే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. సీఎం చంద్రబాబు కూడా సీరియస్ అయ్యారు.