శ్రీవారి హుండీ ఆదాయం రూ. 5.30
NEWS Aug 20,2025 07:45 am
తిరుమల పుణ్యక్షేత్రానికి భారీ ఎత్తున ఆదాయం సమకూరింది. శ్రీవారిని 76 వేల 33 మంది భక్తులు దర్శించుకున్నారు. 26 వేల 905 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 5.30 కోట్లు వచ్చినట్లు తెలిపారు ఈవో జె. శ్యామల రావు. స్వామి వారి దర్శనం కోసం భక్తులు 30 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారని, ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు కనీసం 12 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.