శంషాబాద్లో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
NEWS Aug 19,2025 12:19 pm
హైదరాబాద్ నుంచి తిరుపతి బయలు దేరిన అలయన్స్ ఎయిర్లైన్స్ విమానంలో టేకాఫ్ తర్వాత సాంకేతిక లోపం తలెత్తింది. దీనిని వెంటనే గుర్తించిన పైలట్ విమానాన్ని నిలిపి వేశారు. ఇందులో 67 మంది ప్రయాణీకులు ఉన్నారు. పైలెట్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది.