ప్రకాశం బ్యారేజ్ కు వరద ఉధృతి
NEWS Aug 19,2025 10:35 am
భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి ఏపీని. కృష్ణా నదికి వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. ప్రకాశం బ్యారేజ్ నిండు కుండలా మారింది. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 3.25 లక్షల క్యూసెక్కులు ఉండగా 5 లక్షల క్యూసెక్కులు వరకు చేరే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.కృష్ణానది పరీవాహక ప్రాంతంతో పాటు లంక ప్రజలు జాగ్రత్తంగా ఉండాలన్నారు.