స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే ఒప్పుకోం
NEWS Aug 19,2025 10:08 am
విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల హక్కు అని, దానిని ప్రైవేటీకరణ చేస్తే ఊరుకునేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. ఉన్నట్టుండి సంస్థలో పని చేస్తున్న 5 వేల మంది కార్మికులను ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే తీసి వేశారని, ఇది పూర్తిగా చట్ట విరుద్దమన్నారు. తాజాగా కొన్ని విభాగాలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు టెండర్లు పిలిచారని , వాటిని వెంటనే నిలిపి వేయాలని లేక పోతే ఉద్యమిస్తామన్నారు.