మాజీ మంత్రి కాకాణికి బెయిల్ మంజూరు
NEWS Aug 18,2025 07:01 pm
మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డికి భారీ ఊరట లభించింది. మైనింగ్ కేసులో హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కాగా కాకాణిపై ఎనిమిది కేసులు నమోదయ్యాయి. గత 75 రోజులుగా జైలులో ఉన్నారు కాకాణి. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి. వైసీపీ సర్కార్ కావాలని తనపై అక్రమ కేసులు నమోదు చేసిందని ఆరోపించారు. చివరకు న్యాయమే గెలిచిందన్నారు.