భారీ వర్షాలతో రైళ్ల మళ్లింపు
NEWS Aug 18,2025 01:06 pm
ఏపీలో కుండ పోతగా కురుస్తున్నాయి వర్షాలు. దీంతో పలు మార్గాలలో రైళ్లను దారి మళ్లించారు. కొన్ని రైళ్లను రద్దు చేశారు. కొత్తవలస - కిరందొల్ మార్గంలో రైళ్లను మళ్లించగా కొన్నింటిని పరిమిత దూరానికే తిప్పుతున్నారు. విశాఖ - కిరాందొల్ - విశాఖ ఎక్సప్రెస్ రాయగడ మీదుగా మళ్లించగా, ఇదే ప్యాసింజర్ రైలును అరకు వరకు మాత్రమే పరిమితం చేశారు. 58502 నెంబర్ కలిగిన రైలును కొరాపుట్ వరకు నడిపారు. మంగళవారం విశాఖ - కిరాందొల్ - విశాఖపట్నం ప్యాసింజర్ రైళ్లు రద్దు చేసినట్లు ప్రకటించారు రైల్వే అధికారులు.