19 నుంచి అగ్రికల్చర్ కోర్సుల కౌన్సెలింగ్
NEWS Aug 18,2025 12:16 pm
తెలంగాణ బీఎస్సీ అగ్రికల్చర్ అడ్మిష్మిన్ల ప్రక్రియ ఈ ఏడాదికి సంబంధించి ప్రారంభం కానున్నాయి. ఇందుకు గాను ఆగస్టు 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు తొలి విడత కౌన్సెలింగ్ జరగనుందని తెలంగాణ ఉన్నత విద్యా మండలి వెల్లడించింది. ఈ కోర్సులలో అడ్మిషన్స్ కు గాను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం, డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చరల్ విశ్వ విద్యాలయం, పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ విశ్వ విద్యాలయం లలో వివిధ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సులలో ప్రవేశానికి సంయుక్త కౌన్సెలింగ్ను నిర్వహిస్తాయి.