21న నామినేషన్ల స్వీకరణకు గడువు
NEWS Aug 18,2025 10:25 am
ఉప రాష్ట్రపతి ఎన్నికకు మూడు రోజుల గడువు మాత్రమే ఉంది. ఈనెల 21న నామినేషన్లు స్వీకరిస్తారు. 22న నామినేషన్లు పరిశీలిస్తారు. ఈ నెల 25 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చింది. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరుగుతాయి అదే రోజు కౌటింగ్ జరుపుతారు. రాజ్యసభ, లోక్ సభలో ప్రస్తుత ఎంపీల సంఖ్య 786 గా ఉండగా ఉపరాష్ట్రపతి గెలవాలంటే 394 ఎంపీల బలం అవసరం అవుతుంది. ఇప్పటి వరకు వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న జగదీప్ ధన్ ఖడ్ రాజీనామాతో స్థానం ఖాళీ అయ్యింది.