మత్సకారులు వేటకు వెళ్లొద్దు
NEWS Aug 18,2025 09:32 am
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడడంతో అప్రమత్తంగా ఉండాలని అన్నారు మంత్రి అనగాని సత్య ప్రసాద్. ఈ ఐదురోజులు వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు సూచించారు. ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని గమనిస్తూ, అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించాలని రెవెన్యూ అధికారులు, పోలీసులను ఆదేశించారు. కృష్ణా, గోదావరి నదులకు వరద ఉధృతి ఎక్కువగా ఉన్నందున ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రజల ఆస్తి, ప్రాణ రక్షణకు, వరద విపత్తును ఎదుర్కోవడానికి యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు.