యూరియా కొరతపై వాయిదా తీర్మానం
NEWS Aug 18,2025 09:18 am
తెలంగాణలో యూరియా కొరతపై పార్లమెంటులో వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించారు కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు. లోకసభ సెక్రెటరీ జనరల్కు పంపారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్కు తెలంగాణ రాష్ట్రానికి 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించింది కేంద్రం. ఆగస్టు 13వ తేదీ వరకు 6.60 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా రాష్ట్రానికి సరఫరా చేయాల్సి ఉందని చామల వెల్లడించారు. కాన ఇప్పటి వరకు కేవలం 4.50 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా అయినట్లు తెలిపారు.