రాగల 24 గంటల్లో బంగాళాఖాతంలో వాయుగుండం... ఏపీఎస్డీఎంఏ అలర్ట్
NEWS Aug 17,2025 05:08 pm
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాగల 24 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురవనున్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) వెల్లడించింది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో పశ్చిమమధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని అధికారులు తెలిపారు.