ఓటు చోరీ ఆరోపణల్లో ఆధారాలు లేవు
NEWS Aug 17,2025 04:08 pm
ఓటు చోరీ ఆరోపణల్లో ఆధారాలు లేవని స్పష్టం చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. కొంతమంది ఓటర్లు డబుల్ ఓటింగ్ చేశారని ఆరోపించారని, రుజువు అడిగినప్పుడు, సమాధానం ఇవ్వలేదని అన్నారు ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్. ఎన్నికల కమిషన్ లేదా ఏ ఓటరు కూడా ఇలాంటి తప్పుడు ఆరోపణలకు భయపడరని స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్ భుజంపై తుపాకీ పెట్టి రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.