రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు
NEWS Aug 17,2025 12:02 pm
ఆగస్టు 18న సోమవారం ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు వెళతారు. ఉప రాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ కార్యక్రమానికి హాజరవుతారు. పార్లమెంటరీ బోర్డు భేటీలో ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేయనుంది బీజేపీ. ఈ నెల 21న నామినేషన్ దాఖలు చేస్తారు ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థి. ఈ కార్యక్రమానికి ముందుగానే 20వ తేదీన ఎన్డీయే నేతలు భేటీ అవుతారు. ఇదిలా ఉండగా ఎవరిని అభ్యర్థిగా ఎంపిక చేస్తారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.