కోరుట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
NEWS Aug 16,2025 10:29 pm
JGL: రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కోరుట్ల పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ రవీందర్ సూచించారు. ఈ మేరకు పట్టణంలోని మద్దుల చెరువు ప్రాంతాన్ని కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు, శితిలావస్థలో ఉన్న భవానాల్లో నివసిస్తున్న వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలన్నారు.