రేపటి నుంచి రాహుల్ ఓటర్ యాత్ర
NEWS Aug 16,2025 07:14 pm
ఎంపీ రాహుల్ గాంధీ ఆగస్టు 17న ఆదివారం నుంచి బీహార్ లో ఓటర్ అధికార్ యాత్ర చేపట్టనున్నారు. మొత్తం 1,300 కిలోమీటర్ల మేర కొనసాగనుంది ఈ యాత్ర. . సెప్టెంబర్ 1న పాట్నాలో జరిగే మహాసభతో ముగియనుంది ఈ యాత్ర. ఈ సందర్బంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది కాంగ్రెస్ పార్టీ. తాజాగా రాష్ట్రంలో 65 లక్షల ఓటర్లను జాబితా నుంచి తొలగించడంపై మండిపడ్డారు.