కాళేశ్వరం-పోలవరంపై కేటీఆర్ వ్యాఖ్య
NEWS Aug 16,2025 06:08 pm
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీలో రెండు పిల్లర్లు దెబ్బతింటే 'కూలేశ్వరం' అంటూ విమర్శలు గుప్పించిన కాంగ్రెస్, బీజేపీ నేతలకు, ఇప్పుడు రెండోసారి కాఫర్ డ్యామ్ కొట్టుకుపోయిన పోలవరం ప్రాజెక్టును 'కూలవరం' అని నిందించే ధైర్యం ఉందా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వం, జాతీయ డ్యామ్ భద్రతా అథారిటీ (ఎన్డీఎస్ఏ) పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నాయని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.