ఆదిలాబాద్ జిల్లాను ముంచెత్తిన వాన
NEWS Aug 16,2025 03:46 pm
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి. తంమ్సిలో 16.7 సె.మీ వర్షపాతం నమోదైంది. మంచిర్యాల జిల్లా కన్నెపల్లిలో 14 సె.మీ వర్షపాతం కురిసింది. కడెం ప్రాజెక్టుకు వరద ప్రవాహం పోటెత్తింది . లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇళ్లు, దుకాణాల్లోకి వరద నీరు చేరడంతో ఇబ్బందులు పడుతున్నారు. పలు గ్రామాలు, రాకపోకలు బంద్ అయ్యాయి. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు.