జగిత్యాలలో ముగ్గురు దొంగల అరెస్ట్
NEWS Aug 16,2025 06:14 pm
జగిత్యాల రూరల్ పోలీసులు ముగ్గురు దొంగలను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 12 తులాల బంగారం, ఒక కారు, రూ.15 వేల నగదు, మూడు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని జగిత్యాల డీఎస్పీ రఘు చందర్ మీడియా సమావేశంలో వెల్లడించారు. అరెస్టయిన నేరస్థులు వనం పాపయ్య, వనం రాము, దాసరి రవి అని పోలీసులు తెలిపారు. మరో నిందితుడు జగన్నాథం కృష్ణ పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు డీఎస్పీ పేర్కొన్నారు.