ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కేశినేని చిన్ని
NEWS Aug 16,2025 02:13 pm
విజయవాడలో ఆంధ్ర క్రికెటర్ అసోసియేషన్ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఎలాంటి పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఏసీఏ నూతన కమిటీ ఎన్నికైంది. అధ్యక్షుడిగా టీడీపీ ఎంపీ కేసినేని చిన్నిని ఎన్నుకున్నారు. కార్యదర్శిగా ఎంపీ సానా సతీష్ ఎన్నికయ్యారు. మరో 34 మందితో ఏసీఏ నూతన కమిటీ ఎన్నికైంది. మూడేళ్ల కాల పరమితితో ఈ కమిటీ పని చేస్తుంది. భవిష్యత్తులో చేపట్టనున్న పనులు, స్టేడియాల నిర్మాణం, టోర్నమెంట్ల నిర్వహణపై సమీక్ష జరిగింది.