కృష్ణాష్టమి వేడుకలకు ముగ్గురు మంత్రులు
NEWS Aug 16,2025 08:50 am
హైదరాబాద్: కృష్ణాష్టమి సందర్భంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసుఫ్గూడ డివిజన్లోని వెంకటగిరి చౌరస్తాలో ఉట్టి కొట్టే కార్యక్రమం జరగనుందని జూబ్లీహిల్స్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే గుర్రం మురళీ గౌడ్, మాజీ కార్పోరేటర్ గుర్రం సంజయ్ గౌడ్ తెలిపారు. ఈ వేడుకల్లో మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర రావు, వివేక్ వెంకట స్వామి, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ పాల్గొంటారని తెలిపారు. కన్నులపండువగా జరిగే ఈ వేడుకల్లో భారీ ఎత్తున ప్రజలు పాల్గొనాలని గుర్రం మురళీ గౌడ్, సంజయ్ గౌడ్ ఆహ్వానం పలికారు.