జగిత్యాల - ధర్మపురి రహదారిపై నిలిచిన రాకపోకలు
NEWS Aug 16,2025 01:39 pm
జగిత్యాల జిల్లాలోని ధర్మపురి సమీపంలో ఆకూసాయిపల్లి వద్ద ఎన్హెచ్-63 జాతీయ రహదారిపై ఉన్న లోలెవల్ వంతెనపై వర్షం వల్ల వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో జగిత్యాల నుంచి ధర్మపురికి వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ ప్రాంతంలోని మూలమలుపు వద్ద వరద ఉద్ధృతి కారణంగా రహదారి రాకపోకలకు అనువైన పరిస్థితి లేకుండా పోయింది.