కాళేశ్వరంపై బీఆర్ఎస్ సుప్రీంకోర్టు ప్రయాణం: కేసీఆర్ భేటీ
NEWS Aug 16,2025 10:05 am
కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై కమిషన్ నివేదికను సమర్పించిన సంగతి తెలిసిందే. ఈ నివేదికలో ముఖ్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు, పలువురు ఉన్నతాధికారులపై కమిషన్ తీవ్ర ఆరోపణలు చేసినట్టు తెలుస్తోంది. వీటిని తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టుకు వెళ్లాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈ అంశానికి సంబంధించి కేసీఆర్ ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ లో హరీశ్ రావు, బోయినపల్లి వినోద్ కుమార్ తదితర ముఖ్య నేతలతో నిన్న సమావేశమయ్యారు.