కృష్ణుడు చూపిన బాటలో అందరూ నడవాలి: నారా లోకేశ్
NEWS Aug 16,2025 10:01 am
శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రజలందరికీ ఏపీ మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం శ్రీకృష్ణుడు అవతరించిన రోజు అని అన్నారు. శ్రీకృష్ణుడు చూపిన బాటలో అందరూ నడిచి, తమ జీవితాలను ఆనందంగా తీర్చిదిద్దుకోవాలని ఆయన ఆకాంక్షించారు.మరోవైపు, దివంగత ప్రధాని వాజ్ పేయి వర్ధంతి సందర్భంగా ఆయనకు లోకేశ్ నివాళులు అర్పించారు. నమ్మిన సిద్ధాంతాల కోసం చివరి వరకు కట్టుబడిన వ్యక్తి వాజ్ పేయి అని కొనియాడారు.